కలిగిరి మండలంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను శనివారము ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం, సంఘమిత్ర కార్యాలయము, సహకార సొసైటీ బ్యాంక్ , పోలిస్ స్టేషన్ , తహశీల్దారు కార్యాలయం, ఎక్సైజ్ శాఖ కార్యాలయాలతో పాటు అన్ని గ్రామాలలో ఉన్న వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎందరో స్వాతంత్ర సమరయోధులు చేసిన పోరాటాలు, త్యాగాల ఫలితంగానే మనకు స్వేచ్ఛ లభించిందన్నారు. స్వాతంత్రం అంటే కేవలం వేడుకలు నిర్వహించుకోవడం మాత్రమే కాదని, దేశ సమగ్ర అభివృద్ధి, సామాజిక బాధ్యత, పర్యావరణ పరిరక్షణ, విద్యాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. యువత దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని క్రమశిక్షణ, దేశభక్తి, సేవాభావంతో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమములో తహసిల్దార్ , యస్ ఐ, సి ఐ, మరియు అధికారులు , ఉపాద్యాయులు , విద్యార్ధులు, కలిగిరి మండల కన్వినర్ పూసాల వెంగప నాయుడు , తెలుగుదేశం పార్టీ నాయకులు, మెట్టుకూరి చిరంజీవి రెడ్డి , చేరెడ్డి సుబ్బారెడ్డి , సతీష్ , ప్రదాన కార్యదర్శి కొప్పోలు కొండలరావు , మరియు పార్టీ సీనియర్ నాయకులు , ప్రజలు పాల్గొన్నారు

కలిగిరి మండలంలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
కలిగిరి మండలంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను శనివారము ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం, సంఘమిత్ర కార్యాలయము, సహకార సొసైటీ బ్యాంక్ , పోలిస్ స్టేషన్ , తహశీల్దారు కార్యాలయం, ఎక్సైజ్ శాఖ కార్యాలయాలతో పాటు అన్ని గ్రామాలలో ఉన్న వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎందరో స్వాతంత్ర సమరయోధులు చేసిన పోరాటాలు, త్యాగాల ఫలితంగానే మనకు స్వేచ్ఛ లభించిందన్నారు. స్వాతంత్రం అంటే కేవలం వేడుకలు నిర్వహించుకోవడం మాత్రమే కాదని, దేశ సమగ్ర అభివృద్ధి, సామాజిక బాధ్యత, పర్యావరణ పరిరక్షణ, విద్యాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. యువత దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని క్రమశిక్షణ, దేశభక్తి, సేవాభావంతో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమములో తహసిల్దార్ , యస్ ఐ, సి ఐ, మరియు అధికారులు , ఉపాద్యాయులు , విద్యార్ధులు, కలిగిరి మండల కన్వినర్ పూసాల వెంగప నాయుడు , తెలుగుదేశం పార్టీ నాయకులు, మెట్టుకూరి చిరంజీవి రెడ్డి , చేరెడ్డి సుబ్బారెడ్డి , సతీష్ , ప్రదాన కార్యదర్శి కొప్పోలు కొండలరావు , మరియు పార్టీ సీనియర్ నాయకులు , ప్రజలు పాల్గొన్నారు

