నిర్మల్లో ఓటర్ల జాబితాపై బీఆర్ఎస్ నేతల వినతి.. అభ్యంతరాలను పరిశీలించి న్యాయం చేయాలని డిమాండ్
నిర్మల్: ఓటర్ల జాబితా సమగ్ర పునఃపరిశీలనలో భాగంగా అర్హులైన ఓటర్లకు ఎలాంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సునీల్ కుమార్ రావు అధికారులను కోరారు.
పట్టణంలోని ఆదర్శనగర్ 259, 256 పోలింగ్ స్టేషన్లలో నోటీసులు అందిన వారందరినీ నిశితంగా పరిశీలించి, ఆధారిత పత్రాలను సమర్పించుకునే అవకాశం కల్పించాలని కోరారు. అర్హత ఉన్న ఏ ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగించకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు పల్లి కొండ రాజు, సత్యనారాయణ, మహమ్మద్ ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. అధికారులు ప్రతి అభ్యంతరాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన ఓటర్లకు న్యాయం చేయాలని వారు కోరారు.



