ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఏప్రిల్ 25 (మల్లికార్జున్ రావు పున్నమి ప్రతినిధి).సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శనివారం మనుబోలు మండలం ఎల్ఎన్పురంలో రూ.1 కోటి వ్యయంతో ఏర్పాటు చేసిన త్రీఫేస్ ట్రాన్స్ఫార్మర్ను, రూ.15 లక్షల సిమెంట్ రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా అందిస్తున్నామని తెలిపారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పై గ్రావెల్ దోపిడీ ఆరోపణలు చేశారు. క్వారీ మూసివేతపై ప్రశ్నించారు. కాంట్రాక్టర్ మోసంపై ఫిర్యాదు అందిందని, విచారణ చేసి క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

ఎల్ఎన్పురంలో అభివృద్ధి పనుల ప్రారంభం – గ్రావెల్ దోపిడీపై కాకాని పై సోమిరెడ్డి విమర్శలు
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఏప్రిల్ 25 (మల్లికార్జున్ రావు పున్నమి ప్రతినిధి).సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శనివారం మనుబోలు మండలం ఎల్ఎన్పురంలో రూ.1 కోటి వ్యయంతో ఏర్పాటు చేసిన త్రీఫేస్ ట్రాన్స్ఫార్మర్ను, రూ.15 లక్షల సిమెంట్ రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా అందిస్తున్నామని తెలిపారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పై గ్రావెల్ దోపిడీ ఆరోపణలు చేశారు. క్వారీ మూసివేతపై ప్రశ్నించారు. కాంట్రాక్టర్ మోసంపై ఫిర్యాదు అందిందని, విచారణ చేసి క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

