నంద్యాల: ఎయిడ్స్ నియంత్రణకు జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ మార్గదర్శకాల ప్రకారం సమన్వయంతో పనిచేసి 95-95-95 లక్ష్యాలను సాధించాలని డాక్టర్ శారదాబాయి సూచించారు. శుక్రవారం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన ఏఆర్టీ సమన్వయ సమావేశంలో ఆమె మాట్లాడారు. హెచ్ఐవీ పరీక్షలపై ప్రజల్లో అవగాహన పెంచి, బాధితులకు ఏఆర్టీ కేంద్రాల ద్వారా నిరంతరం మందులు అందేలా పర్యవేక్షించాలని ఆదేశించారు.ముఖ్యంగా గర్భిణులు, క్షయ వ్యాధిగ్రస్తులు, అధిక ప్రమాదంలో ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. బాధితుల వ్యక్తిగత వివరాల గోప్యతను కాపాడుతూ, ప్రైవేట్ ఆసుపత్రులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్టీ వైద్యులు, సీపీఎం అలీ హైదర్, కౌన్సిలర్లు మరియు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఎయిడ్స్ నియంత్రణకు సమష్టిగా పోరాడుదాం: డాక్టర్ శారదాబాయి
నంద్యాల: ఎయిడ్స్ నియంత్రణకు జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ మార్గదర్శకాల ప్రకారం సమన్వయంతో పనిచేసి 95-95-95 లక్ష్యాలను సాధించాలని డాక్టర్ శారదాబాయి సూచించారు. శుక్రవారం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన ఏఆర్టీ సమన్వయ సమావేశంలో ఆమె మాట్లాడారు. హెచ్ఐవీ పరీక్షలపై ప్రజల్లో అవగాహన పెంచి, బాధితులకు ఏఆర్టీ కేంద్రాల ద్వారా నిరంతరం మందులు అందేలా పర్యవేక్షించాలని ఆదేశించారు.ముఖ్యంగా గర్భిణులు, క్షయ వ్యాధిగ్రస్తులు, అధిక ప్రమాదంలో ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. బాధితుల వ్యక్తిగత వివరాల గోప్యతను కాపాడుతూ, ప్రైవేట్ ఆసుపత్రులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్టీ వైద్యులు, సీపీఎం అలీ హైదర్, కౌన్సిలర్లు మరియు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

