ఖమ్మం ఆగష్టు
(పున్నమి న్యూస్)
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం గ్రామానికి చెందిన గడ్డం వేణు కుమార్ ఉద్యోగ నోటిఫికేషన్లు రావడం లేదనే మనస్తాపంతో శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వేణును హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించాలని అధికార పార్టీ నాయకులు, పోలీసులు తమపై ఒత్తిడి తెస్తున్నారని వేణు నాయనమ్మ ఆరోపించారు.
వేణుకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు తమ కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కూడా ఆమె డిమాండ్ చేశారు.



