Sunday, 13 September 2026
  • Home  
  • ఉదయగిరి : అటవీ అమరవీరులకు ఘన నివాళి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి : అటవీ అమరవీరులకు ఘన నివాళి

ఉదయగిరి అటవీశాఖ రేంజ్ కార్యాలయ ఆవరణంలో జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినాన్ని ఘనంగా నిర్వహించారు. రేంజర్ బి.ఎస్. కుమార్ రాజా ఆధ్వర్యంలో అటవీశాఖ సిబ్బంది అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అటవీ సంపద, వన్యప్రాణుల సంరక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అటవీశాఖ అమరవీరుల సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. వారి త్యాగాలు స్ఫూర్తిదాయకమని అధికారులు పేర్కొన్నారు. అడవులు, వన్యప్రాణుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అటవీశాఖ సిబ్బంది పాల్గొని అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు.

ఉదయగిరి అటవీశాఖ రేంజ్ కార్యాలయ ఆవరణంలో జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినాన్ని ఘనంగా నిర్వహించారు. రేంజర్ బి.ఎస్. కుమార్ రాజా ఆధ్వర్యంలో అటవీశాఖ సిబ్బంది అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అటవీ సంపద, వన్యప్రాణుల సంరక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అటవీశాఖ అమరవీరుల సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. వారి త్యాగాలు స్ఫూర్తిదాయకమని అధికారులు పేర్కొన్నారు. అడవులు, వన్యప్రాణుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అటవీశాఖ సిబ్బంది పాల్గొని అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.