– రామారెడ్డిలో ఇందిరా గాంధీ జయంతి సంబురాలు
కామారెడ్డి, 19 నవంబర్, ( పున్నమి ప్రతినిధి ) :
దేశ ఐక్యత, పేదల అభ్యుదయానికి జీవితాన్ని అర్పించిన ఉక్కు మహిళ, భారతరత్న, మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ జయంతిని కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహించింది. బుధవారం రామారెడ్డి మండల కేంద్రంలోని రైతు వేదిక ఆవర ణలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు,కార్య కర్తలు, అభిమా నులు పాల్గొని ఆమె చిత్రపటా నికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.మండ ల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్ గౌడ్ మాట్లాడుతూ, ఇం దిరా గాంధీ రాజకీ య దూరదృష్టి,కఠిన నిర్ణయా లు, బలమైన నాయకత్వం దేశపరంగా అమూల్య మని అన్నారు. పేదల సంక్షేమాన్ని ధ్యేయంగా తీ సుకుని అనేక ఆర్థిక, సామాజిక సంస్కరణలు చే పట్టిన తీరు నేటికీ ఆదర్శమని గుర్తుచేశారు. ఇంది రమ్మ చూపిన మార్గంలో ప్రజాసేవకు అంకితం కా వాలని కాంగ్రెస్ కార్యకర్తలు తీర్మానించారు.ఈ కా ర్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, యువకులు,మహిళా కాంగ్రెస్ నేతలు, గ్రామస్థాయి కార్యకర్తలు పాల్గొన్నారు.


