తిరుపతి ఆగస్టు 07 (పున్నమి ప్రతినిధి)
ఏకవీర సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆడి కృత్తిక పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతి సమీపంలోని పవిత్ర క్షేత్రమైన యోగులపర్వతంలో జ్ఞాన కుమారస్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డాయి.
ఈ సందర్భంగా జ్ఞాన కుమారస్వామికి విశేష పూజలు, హారతులు నిర్వహించి భక్తులు స్వామివారి ఆశీస్సులు పొందారు. సుమారు 50 మంది భక్తులు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని భక్తి పారవశ్యంలో పూజల్లో పాల్గొన్నారు.
అనంతరం విచ్చేసిన భక్తులందరికీ మహా ప్రసాదం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పూజ్యశ్రీ ప్రతాప్ స్వామీజీ మాట్లాడుతూ, ఆడి కృత్తిక రోజున కుమారస్వామిని ఆరాధించడం ద్వారా జ్ఞానం, ధైర్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయని, సనాతన ధర్మ సంప్రదాయాలను భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన భక్తులకు, స్వచ్ఛంద సేవకులకు మరియు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
॥ ఓం శరవణభవ ॥
॥ శ్రీ జ్ఞాన కుమారస్వామికి జయము ॥
॥ సర్వే జనాః సుఖినో భవంతు ॥




