కొచ్చి: కేరళలో అరుదైన అమీబిక్ మెదడు ఇన్ఫెక్షన్ కారణంగా 73 ఏళ్ల మహిళ మృతి చెందినట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. కలుషిత నీటి ద్వారా ఈ వ్యాధి సోకే అవకాశం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా చెరువులు, కాలువలు, పరిశుభ్రత లేని నీటి వనరుల్లో స్నానం చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రజలు శుభ్రమైన నీటినే వినియోగించాలని, అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆరోగ్య అధికారులు తెలిపారు. ఆరోగ్య భద్రతపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

అమీబిక్ ఇన్ఫెక్షన్తో మహిళ మృతి
కొచ్చి: కేరళలో అరుదైన అమీబిక్ మెదడు ఇన్ఫెక్షన్ కారణంగా 73 ఏళ్ల మహిళ మృతి చెందినట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. కలుషిత నీటి ద్వారా ఈ వ్యాధి సోకే అవకాశం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా చెరువులు, కాలువలు, పరిశుభ్రత లేని నీటి వనరుల్లో స్నానం చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రజలు శుభ్రమైన నీటినే వినియోగించాలని, అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆరోగ్య అధికారులు తెలిపారు. ఆరోగ్య భద్రతపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

