శ్రీకాళహస్తి, మే 03 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలోని స్కిట్ కళాశాల సమీపంలో ఆపరేషన్ సింధూర్లో ప్రాణత్యాగం చేసిన వీర జవాన్ మురళి నాయక్ జ్ఞాపకార్థం ‘మురళి నాయక్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్’ (సూపర్ సిక్స్ సీజన్-2) ఆదివారం అత్యంత ఉత్సాహంగా ప్రారంభమైంది. సంకల్ప్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ క్రీడా సంబరాలకు హైకోర్టు అడ్వకేట్ రవికుమార్, సామాజిక కార్యకర్త మురళి నాయుడు స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. యువతలో దేశభక్తిని పెంపొందించడంతో పాటు వారు దురలవాట్లకు దూరంగా ఉండి శారీరక దారుఢ్యాన్ని సాధించేందుకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. అమర జవాన్ త్యాగాన్ని స్మరించుకుంటూ నిర్వహిస్తున్న ఈ పోటీలకు స్థానిక క్రీడాకారుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.

అమర జవాన్ మురళి నాయక్ స్మరణార్థం క్రికెట్ టోర్నీ ప్రారంభం
శ్రీకాళహస్తి, మే 03 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలోని స్కిట్ కళాశాల సమీపంలో ఆపరేషన్ సింధూర్లో ప్రాణత్యాగం చేసిన వీర జవాన్ మురళి నాయక్ జ్ఞాపకార్థం ‘మురళి నాయక్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్’ (సూపర్ సిక్స్ సీజన్-2) ఆదివారం అత్యంత ఉత్సాహంగా ప్రారంభమైంది. సంకల్ప్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ క్రీడా సంబరాలకు హైకోర్టు అడ్వకేట్ రవికుమార్, సామాజిక కార్యకర్త మురళి నాయుడు స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. యువతలో దేశభక్తిని పెంపొందించడంతో పాటు వారు దురలవాట్లకు దూరంగా ఉండి శారీరక దారుఢ్యాన్ని సాధించేందుకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. అమర జవాన్ త్యాగాన్ని స్మరించుకుంటూ నిర్వహిస్తున్న ఈ పోటీలకు స్థానిక క్రీడాకారుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.

