Monday, 18 May 2026
  • Home  
  • అనాధలకు,నిరాశ్రయులకు నిత్యవసరాలు పంపిణీ – ముఖ్యఅతిథిగా పాల్గొన్న పోలీస్ కమిషనర్ బాగ్చి
- విశాఖపట్నం

అనాధలకు,నిరాశ్రయులకు నిత్యవసరాలు పంపిణీ – ముఖ్యఅతిథిగా పాల్గొన్న పోలీస్ కమిషనర్ బాగ్చి

ప్రపంచ నిరాశ్రయుల దినోత్సవం సందర్భంగా నగరంలోని టి ఎస్ ఆర్ కాంప్లెక్స్ లో ఉన్న మానసిక రోగులు ఒంటరి మహిళల పునరావాస కేంద్రంలో నిరాశ్రయులకు కే ఎస్ ఆర్ బ్యాడ్మింటన్ అకాడమీ ఆధ్వర్యంలో నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర పోలీస్ కమిషనర్ శంకర్ బ్రత బాగ్చి పాల్గొన్నారు. కె ఎస్ ఆర్ బ్యాడ్మింటన్ అకాడమీ వ్యవస్థాపకులు కలిదిండి సుందర రామరాజు తన సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా బియ్యం,పప్పు దినుసులు, నిత్యవసరాలు, పళ్ళు,వస్త్రాలు మొదలైనవి అందజేశారు.వీటిని పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆపద్బాందు సేవా ట్రస్ట్ అధ్యక్షులు జిఎస్ఎన్ రాజు నాలుగు బియ్యం బస్తాలు వితరణ చేశారు. సేవా దృక్పథంతో చేస్తున్న ఈ బృహత్తర కార్యక్రమాన్ని వివిధ కార్యక్రమాలలో దాతలుగా ఉంటున్న సుందర రామ రాజు, జి ఎస్ ఎన్ రాజు తదితరులను నగర సిపి బాగ్చి అభినందించారు. సాయం చేసే చేతులను భగవంతుడు ఆశీర్వదిస్తాడన్నారు. నగరంలో రోడ్ల పక్కన అనాదలు, మానసిక రోగులు, బెగ్గర్స్ లేకుండా చూస్తూ వారిని పునరావాస కేంద్రానికి తరలించాలని పోలీస్ లకు సిపి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్, సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, స్వరూప్, దేవిశ్రీ, మనోహర్,ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ప్రపంచ నిరాశ్రయుల దినోత్సవం సందర్భంగా నగరంలోని టి ఎస్ ఆర్ కాంప్లెక్స్ లో ఉన్న మానసిక రోగులు ఒంటరి మహిళల పునరావాస కేంద్రంలో నిరాశ్రయులకు కే ఎస్ ఆర్ బ్యాడ్మింటన్ అకాడమీ ఆధ్వర్యంలో నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర పోలీస్ కమిషనర్ శంకర్ బ్రత బాగ్చి పాల్గొన్నారు. కె ఎస్ ఆర్ బ్యాడ్మింటన్ అకాడమీ వ్యవస్థాపకులు కలిదిండి సుందర రామరాజు తన సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా బియ్యం,పప్పు దినుసులు, నిత్యవసరాలు, పళ్ళు,వస్త్రాలు మొదలైనవి అందజేశారు.వీటిని పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆపద్బాందు సేవా ట్రస్ట్ అధ్యక్షులు జిఎస్ఎన్ రాజు నాలుగు బియ్యం బస్తాలు వితరణ చేశారు. సేవా దృక్పథంతో చేస్తున్న ఈ బృహత్తర కార్యక్రమాన్ని వివిధ కార్యక్రమాలలో దాతలుగా ఉంటున్న సుందర రామ రాజు, జి ఎస్ ఎన్ రాజు తదితరులను నగర సిపి బాగ్చి అభినందించారు. సాయం చేసే చేతులను భగవంతుడు ఆశీర్వదిస్తాడన్నారు. నగరంలో రోడ్ల పక్కన అనాదలు, మానసిక రోగులు, బెగ్గర్స్ లేకుండా చూస్తూ వారిని పునరావాస కేంద్రానికి తరలించాలని పోలీస్ లకు సిపి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్, సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, స్వరూప్, దేవిశ్రీ, మనోహర్,ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.