
అనంతపురంలోని అరవింద్ నగర్లో కృష్ణాష్టమి వేడుకలను ప్రభోధానంద స్వామి శిష్యులు ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణ భగవానుడు నెమలి పింఛం ఎందుకు పెట్టుకున్నాడు, పిల్లనగ్రోవి ఎందుకు పట్టుకుంటారో తెలియనప్పుడే నిజమైన జ్ఞానం వస్తుందని తెలిపారు. భగవద్గీత చదివితే జ్ఞానం, కరుణ, ప్రేమ వస్తుందన్నారు. అన్ని మతాలవారు భగవద్గీత చదవాలని వారు సూచించారు.

