– ,
రాజకీయాల్లోనే కాకుండా ఆధ్యాత్మిక సేవలో కూడా మన ఫౌండేషన్ చైర్మన్ మన్నేటి వెంకటరెడ్డి తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. కలిగిరి మండలం క్రిష్ణా రెడ్డి పాలెం తో కలవారి పాలెం లో
పోలేరమ్మ, శీతల, నాభిశిల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో ఉదయగిరి నియోజకవర్గ మాజీ ఏఎంసి చైర్మన్, టీడీపీ రాష్ట్ర నాయకులు, మన ఫౌండేషన్ అధినేత మన్నేటి వెంకటరెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందారు.ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తులు, గ్రామ ప్రజలతో ఆప్యాయంగా మమేకమై వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులు అంగరంగ వైభవంగా బాణాసంచా కాల్చి, తప్పేట గుళ్ల నాదాలతో ఘన స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు.ఆలయ అభివృద్ధికి తన వంతు బాధ్యతగా భావించిన మన్నేటి వెంకటరెడ్డి , మన ఫౌండేషన్ తరఫున రూ.70,000/- విరాళాన్ని అందజేసి దైవసేవ పట్ల తన అంకితభావాన్ని మరోసారి చాటిచెప్పారు.ప్రజాసేవతో పాటు దైవసేవ కూడా సమాజ అభివృద్ధికి ఎంతో అవసరమనే సంకల్పంతో, సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుండే ఉదయగిరి నియోజకవర్గ మాజీ ఏఎంసి చైర్మన్, టీడీపీ నాయకులు, మన ఫౌండేషన్ అధినేత మన్నేటి వెంకటరెడ్డి ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించారు.



