జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం సముద్రాల గ్రామంలో వర్షాభావంతో వాడిపోయిన పత్తి మొలకలకు రాత్రి నుంచి కురుస్తున్న ముసురు వర్షం ప్రాణం పోసింది. కొన్ని రోజులుగా వర్షాలు లేక ఎండిపోయే దశకు చేరిన పంటను ఈ వర్షం ఆదుకుంది. నేల తేమను సంతరించుకోవడంతో పత్తి విత్తనాలు తిరిగి పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. దీంతో గ్రామ రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- జనగాం
సముద్రాలలో పత్తి మొలకలకు ప్రాణం పోసిన ముసురు వర్షం
జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం సముద్రాల గ్రామంలో వర్షాభావంతో వాడిపోయిన పత్తి మొలకలకు రాత్రి నుంచి కురుస్తున్న ముసురు వర్షం ప్రాణం పోసింది. కొన్ని రోజులుగా వర్షాలు లేక ఎండిపోయే దశకు చేరిన పంటను ఈ వర్షం ఆదుకుంది. నేల తేమను సంతరించుకోవడంతో పత్తి విత్తనాలు తిరిగి పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. దీంతో గ్రామ రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

