ఖమ్మం/వైరా
(పున్నమి న్యూస్)
వైరాలో నిర్వహించిన సంత్ గురు రవిదాస్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఖమ్మం జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు రీగన్ ప్రతాప్ హాజరై గురు రవిదాస్ బోధనలు సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి శ్రీరామనేని మణి పాల్గొని గురు రవిదాస్ సేవలను స్మరించుకున్నారు. వైరా నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు. సమాజంలో సమానత్వం, సామరస్యం కోసం ఆయన ఆశయాలను ఆచరించాలని నాయకులు పిలుపునిచ్చారు.



