విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి కి అభినందనలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ – బృందం.
విశాఖపట్నం,డిసెంబర్ 30 పున్నమి ప్రతినిధి:-
విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి సేవలకు ప్రభుత్వం పదోన్నతి కల్పించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా ఉండగా, ఇప్పుడు డైడెక్టర్ జనరల్గా (డీజీ) ప్రమోషన్ ఇచ్చింది. అయితే అదే హోదాలో విశాఖపట్నం పోలీస్ కమిషనర్గా బాధ్యతలు నిర్వహించాలని సూచించడం గమనార్హం.ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ మీడియా ఫెడరేషన్ -ఏపీఎంఎఫ్ విశాఖపట్నం యూనియన్ శంక బ్రత బాగ్చి ని మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపింది.
యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎం. లత, విశాఖ జిల్లా అధ్యక్షుడు కేశానపల్లి.కిరణ్ కుమార్,కార్య దర్శి బేర.సురేష్ ,సహాయ కార్యదర్శి అప్పలరాజు, కోశాధికారి వాసుపల్లి రాజు , అలాగే కమిటీ సభ్యులు శంకర్, ప్రసాద్ యాదవ్, మీనా, జెమిని న్యూస్ ఎడిటర్ సారా, అనుపమ యాదవ్ , అర్జున్ తదితరులు ఆయనను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛాలను అంద జేశారు.


