రాజంపేట నవంబర్, 3 (పున్నమి ప్రతినిధి)
విభిన్న ప్రతిభావంతుల సేవా సంఘం ఆధ్వర్యంలో రాజంపేట జిల్లా కేంద్రం చేయాలని రాజంపేట ఆర్టీసీ బస్టాండ్ మొదలగుని పాత బస్టాండ్ నుంచి సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ చేపట్టారు.ర్యాలీ అనంతరం రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏవోకి రాజంపేట జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలనీ వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా రాజంపేట విభిన్న ప్రతిభావంతుల సేవా సంఘం అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ మాట్లాడుతూ రాజంపేటలో ఎప్పటి నుంచో ఐఏఎస్ హోదా కలిగి ఉందని అదేవిధంగా రాజంపేటలో రవాణా సౌకర్యం,నీటి వనరులు,ఖనిజ సంపద,ప్రైవేటు యూనివర్సిటీ, అన్నమయ్య జన్మస్థలం అనేక వాటికి పుట్టినిల్లు రాజంపేట అని తెలిపారు.అన్ని వసతులు కలిగిన రాజంపేటను జిల్లా చేయాలని డిమాండ్ చేస్తున్నాము అని తెలిపారు. ఈ ర్యాలీలో దివ్యాంగుల క్రికెట్ క్రీడాకారుడు శివకోటి, ఉపాధ్యక్షుడు ఖాదర్బాషా, చంద్రశేఖర్,పుల్లంపేట అధ్యక్షుడు సుబ్బనరసారెడ్డి, కృష్ణ,సెక్రెటరీ వెంకట ప్రసాద్ వివిధ మండల విభిన్న ప్రతిభావంతులు అధ్యక్షులు పాల్గొన్నారు.


