*
ఇబ్రహీంపట్నం,
విఘ్నేశ్వరుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, విగ్నేశ్వరుని దయతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జంపాల సీతారామయ్య గారు…
వినాయక చవితి సందర్భంగా పశ్చిమ ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం లో వినాయక చవితి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. తెలుగు సాంప్రదాయం వస్త్రాలు ధరించి వేడుకల్లో పాల్గొన్నారు జంపాల. వినాయకుడికి వివిధ రకాల నైవేద్యాలు, సమర్పించి పూజల నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విఘ్నేశ్వరుని దయతో అందరూ హాయిగా ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు.



