పున్నమి తెలుగు దిన పత్రిక ✍
విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ జాతీయ సేవా పథకం సమన్వయ కర్త డా. ఉదయ్ శంకర్ అల్లం కు ప్రపంచ రక్తదాతల దినోత్సవ సందర్భముగా కోవిద్-19 విపత్కర పరిస్థితులలో రక్తదాన శిబిరాన్నీ ఏర్పాటు చేసి సుమారు 50 యూనిట్స్ రక్తాన్ని సేకరించినందుకు జాయింట్ కలెక్టర్ డా. ఎన్ . ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రత్యేక ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. లాక్ డౌన్ సమయం లో రక్త నిల్వలు తరించుకు పోతున్న తరుణంలో ఎంతోమంది ముందుకు వచ్చి వారివంతు సాయంగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి రక్తదాతలను ప్రోత్సహించి రక్తదానం చేయించి నందుకు సుమారు 12 మందిని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు ఈ రోజు రెడ్ క్రాస్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో హెల్ప్ ది నీడీ సభ్యులు పార్థసారధి, రాజేష్, చైతన్య, అఖిల్ మరియు హరీష్ పాల్గొన్నారు రక్త దాన శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలను కాపాడి, అమూల్యమైన సేవలను అందించినందుకు డా. ఉదయ్ శంకర్ ను రెడ్ క్రాస్ చైర్మన్ శ్రీ పి చంద్రశేఖర్ రెడ్డి గారు, విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఆర్ సుదర్శన రావు గారు, రిజిస్ట్రార్ డా. యల్ . విజయ కృష్ణా రెడ్డి గారు మరియు పలువురు అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది అభినందించారు.