రోడ్డు ప్రమాదాలను తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై జాతీయ రహదారులపై ఏదైనా నిర్దిష్ట ప్రాంతంలో ఏడాదిలో ఒకటి కంటే ఎక్కువ ప్రమాదాలు జరిగితే, సంబంధిత రోడ్డు కాంట్రాక్టర్లపై భారీ జరిమానాలు విధించనుంది. రోడ్డు భద్రత ప్రమాణాలను పాటించకపోవడం, సరైన రహదారి సంరక్షణ లేకపోవడం వంటి కారణాలతో జరిగే ప్రమాదాలపై బాధ్యత కాంట్రాక్టర్లదేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ చర్యతో రహదారి పనుల్లో నాణ్యత పెరిగి ప్రమాదాలు తగ్గుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదాలకు చెక్ – కాంట్రాక్టర్లపై కేంద్రం కఠిన నిర్ణయం
రోడ్డు ప్రమాదాలను తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై జాతీయ రహదారులపై ఏదైనా నిర్దిష్ట ప్రాంతంలో ఏడాదిలో ఒకటి కంటే ఎక్కువ ప్రమాదాలు జరిగితే, సంబంధిత రోడ్డు కాంట్రాక్టర్లపై భారీ జరిమానాలు విధించనుంది. రోడ్డు భద్రత ప్రమాణాలను పాటించకపోవడం, సరైన రహదారి సంరక్షణ లేకపోవడం వంటి కారణాలతో జరిగే ప్రమాదాలపై బాధ్యత కాంట్రాక్టర్లదేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ చర్యతో రహదారి పనుల్లో నాణ్యత పెరిగి ప్రమాదాలు తగ్గుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

