ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మే 7 (మల్లికార్జున రావ్ పున్నమి ప్రతినిధి )
మనుబోలు మండలం పిడూరు పాలెంలో వన్ మంత్ వన్ విలేజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు తమ రెవెన్యూ సమస్యలను అధికారులకు వినిపించారు. డీటీ ప్రదీప్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా పెండింగ్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామాల్లో నెలలో నాలుగు సార్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి రైతుల అర్జీలను స్వీకరించి పరిష్కారం దిశగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. దీర్ఘకాలిక సమస్యలను అవసరమైతే పై అధికారులకు పంపిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎండిఓ తరజాక్షి, ఆర్ఐ, వీఆర్వో, గ్రామ రైతులు పాల్గొన్నారు.

రెవెన్యూ సమస్యల పరిష్కారమే లక్ష్యం – వన్ మంత్ వన్ విలేజ్ కార్యక్రమం నిర్వహణ
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మే 7 (మల్లికార్జున రావ్ పున్నమి ప్రతినిధి ) మనుబోలు మండలం పిడూరు పాలెంలో వన్ మంత్ వన్ విలేజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు తమ రెవెన్యూ సమస్యలను అధికారులకు వినిపించారు. డీటీ ప్రదీప్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా పెండింగ్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామాల్లో నెలలో నాలుగు సార్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి రైతుల అర్జీలను స్వీకరించి పరిష్కారం దిశగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. దీర్ఘకాలిక సమస్యలను అవసరమైతే పై అధికారులకు పంపిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎండిఓ తరజాక్షి, ఆర్ఐ, వీఆర్వో, గ్రామ రైతులు పాల్గొన్నారు.

