మొలక పోలేరమ్మ జాతరలో పాల్గొన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి
SPSR నెల్లూరు జిల్లా, మే 6: ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలో జరిగిన శ్రీశ్రీశ్రీ మొలక పోలేరమ్మ తల్లి జాతర మహోత్సవంలో మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, భక్తులు బాణసంచా కాల్పులు, మేళతాళాలు, యువత కేరింతల మధ్య ఆయనకు ఘన స్వాగతం పలికారు. గ్రామస్థుల ఐకమత్యంతో ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని కాకాణి పేర్కొన్నారు. ప్రజల సుఖసంతోషాలు, గ్రామ అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ ప్రజలతోనే ఉంటామని ఆయన తెలిపారు.

మొలక పోలేరమ్మ జాతరలో పాల్గొన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి
మొలక పోలేరమ్మ జాతరలో పాల్గొన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి SPSR నెల్లూరు జిల్లా, మే 6: ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలో జరిగిన శ్రీశ్రీశ్రీ మొలక పోలేరమ్మ తల్లి జాతర మహోత్సవంలో మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, భక్తులు బాణసంచా కాల్పులు, మేళతాళాలు, యువత కేరింతల మధ్య ఆయనకు ఘన స్వాగతం పలికారు. గ్రామస్థుల ఐకమత్యంతో ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని కాకాణి పేర్కొన్నారు. ప్రజల సుఖసంతోషాలు, గ్రామ అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ ప్రజలతోనే ఉంటామని ఆయన తెలిపారు.

