రైల్వే కోడూరు నియోజకవర్గంలోని పెనగలూరు మండలం కొత్త సింగనమాల గ్రామానికి చెందిన పసుపులేటి వెంకట్ అనిల్ కుమార్ మృతితో కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వం అండగా నిలిచింది. బాధిత కుటుంబ సభ్యురాలు పసుపులేటి శ్రీలక్ష్మికి రూ.1,32,466 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్ఎఫ్) చెక్కును వారి నివాసం వద్ద రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి, KUDA చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పి, ప్రభుత్వం ప్రజల కష్టసుఖాల్లో ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

మృతుడి కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ
రైల్వే కోడూరు నియోజకవర్గంలోని పెనగలూరు మండలం కొత్త సింగనమాల గ్రామానికి చెందిన పసుపులేటి వెంకట్ అనిల్ కుమార్ మృతితో కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వం అండగా నిలిచింది. బాధిత కుటుంబ సభ్యురాలు పసుపులేటి శ్రీలక్ష్మికి రూ.1,32,466 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్ఎఫ్) చెక్కును వారి నివాసం వద్ద రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి, KUDA చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పి, ప్రభుత్వం ప్రజల కష్టసుఖాల్లో ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

