రాజన్న సిరిసిల్ల ఆగస్టు 17 (పున్నమి ప్రతినిధి)
ముస్తాబాద్: మండల వ్యవసాయ అధికారి అందుబాటులో ఉండడం లేదని ఆరోపిస్తూ ముస్తాబాద్ బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బొంపల్లి సురేందర్రావు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు అందుబాటులో ఉండాల్సిన అధికారి విధులకు సక్రమంగా హాజరుకావడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుత వ్యవసాయ అధికారిని మార్చి, రైతులకు అందుబాటులో ఉండి సమర్థవంతంగా పనిచేసే నూతన అధికారిని నియమించాలని అధికారులను విజ్ఞప్తి చేశారు. రైతులకు ప్రభుత్వ పథకాలు, వ్యవసాయ సలహాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ముస్తాబాద్ వ్యవసాయ అధికారిని మార్చాలి: ప్రజావాణిలో బొంపల్లి సురేందర్ రావు ఫిర్యాదు
రాజన్న సిరిసిల్ల ఆగస్టు 17 (పున్నమి ప్రతినిధి) ముస్తాబాద్: మండల వ్యవసాయ అధికారి అందుబాటులో ఉండడం లేదని ఆరోపిస్తూ ముస్తాబాద్ బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బొంపల్లి సురేందర్రావు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు అందుబాటులో ఉండాల్సిన అధికారి విధులకు సక్రమంగా హాజరుకావడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుత వ్యవసాయ అధికారిని మార్చి, రైతులకు అందుబాటులో ఉండి సమర్థవంతంగా పనిచేసే నూతన అధికారిని నియమించాలని అధికారులను విజ్ఞప్తి చేశారు. రైతులకు ప్రభుత్వ పథకాలు, వ్యవసాయ సలహాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

