మహాముత్తారం మండలకేంద్రంలోని స్తంభంపల్లి(పిపి) గ్రామంలో ఈరోజు మార్కండేయ యూత్(నేతకానీ యూత్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేయు గణపతి మండపం వద్ద కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జాడి రాజయ్య గారికి సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు మాట్లాడుతూ మాతో పాటు కలిసి మెలిసి ఉన్న సామాన్య వ్యక్తి మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో అసమాన్య నాయకుడిగా ఎదిగి మా ఊరికి మంచి పేరు తీసుకు రావడం జరిగింది అలాగే ఇక ముందు ముందు ఇంకా మంచి స్థాయిలో ఉండాలని ఒక ప్రకటనలో తెలిపారు, ఈ కార్యక్రమం లో మార్కండేయ యూత్ సభ్యులు మరియు పెద్దలు పాల్గొన్నారు.



