పున్నమి ప్రతినిధి – షేక్. రసూల్ అహమద్ : అత్యంత పేద దేశమైన బురుండి తూర్పు ఆఫ్రికా ఖండంలో ఉంది. దీర్ఘకాలంగా అంతర్యుద్దాలలో మునిగిపోయిన బురిండి 1962 వ సంవత్సరంలో స్వాతంత్య్రం పొందింది. అది మొదలు ఇప్పటిదాకా ఏకగ్రీవ లేదా పోటీ ఎన్నికలు జరగలేదు. మొదటిసారిగా ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు బురుండి ప్రజల భవిషత్తును నిర్ణయించబోతున్నాయి. 3సార్లు అధ్యక్షుడిగా నాకురింజిజా ఎన్నికై బురుండి దేశానికి దీర్ఘకాల అధ్యక్షుడిగా పని చేసి తన పాలనాకాలంలో రాజకీయ ప్రత్యర్థుల హత్యలు, అరెస్టులు చేసిన నాకురింజిజా అప్రతిష్ట కూడగొట్టున్నాడు. నేటి గ్లోబల్ మహమ్మారి సమయంలో కూడా స్టేడియాలలో భారీ ర్యాలీలు చేసి తమ పార్టీని గెలిపించమని విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. మాజీ తిరుగుబాటు నాయకుడు, మానవ హక్కుల ఉల్లంఘనలకు కారణమయ్యాడనే ఆరోపణలను ఎదుర్కొంటూ అంతర్జాతీయ ప్రయత్నాలను తప్పించుకొంటూ గత 15 సంవత్సరాలుగా శిక్షార్హత లేకుండా దేశాన్ని పాలించిన నాకురుంజిజాకు వారసుడిని, బురుండి దేశ పౌరులు బుధవారం నాడు ఎన్నుకుంటున్నారు. సుమారు 1,500 పోలింగ్ కేంద్రాలలో ఐదు మిలియన్లకు పైగా ప్రజలు ఓటు వేస్తున్నారని, 1993 లో ప్రారంభమై 2005 లో ముగిసిన అంతర్యుద్ధం తరువాత ఇది మొదటి పోటీ ఎన్నిక అని నిపుణులు చెపుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుండి, దేశ సరిహద్దులు తెరచి ఉంచుతూ పెద్ద పెద్ద ర్యాలీలు నిర్వహించడానికి అధికారులు అనుమతినిస్తూ కరోనా నుంచి దేవుడు కాపాడుతాడని ఉదహరిస్తున్న నేపథ్యంలో, కరోనా సంక్రమణకు దారితీస్తుందని who అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం దేశంలో సానుకూల కేసులు పెద్దగా లేవని కేవలం ఒక మరణం మాత్రమే నమోదయిందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు బురుండీలో లేవని, కరోనా వైరస్ వ్యాప్తి ఆసలే లేదని ఇది దేశాన్నిపెద్దగా ప్రభావితం చేయదని ప్రభుత్వ అధికారులు చెపుతున్నారు. గోజిలోని ఒక సమావేశంలో బురుండి అధ్యక్షుడు ఒక అడుగు ముందు వేసి మనం రద్దీగా ఉన్నాము కదా మనకు ఏమైనా సమస్య ఉందా, ‘ఎల్లప్పుడూ దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి చప్పట్లు కొడదాం’ అని ప్రజలను ఆదేశించాడు.
పున్నమి ప్రతినిధి – షేక్. రసూల్ అహమద్ : అత్యంత పేద దేశమైన బురుండి తూర్పు ఆఫ్రికా ఖండంలో ఉంది. దీర్ఘకాలంగా అంతర్యుద్దాలలో మునిగిపోయిన బురిండి 1962 వ సంవత్సరంలో స్వాతంత్య్రం పొందింది. అది మొదలు ఇప్పటిదాకా ఏకగ్రీవ లేదా పోటీ ఎన్నికలు జరగలేదు. మొదటిసారిగా ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు బురుండి ప్రజల భవిషత్తును నిర్ణయించబోతున్నాయి. 3సార్లు అధ్యక్షుడిగా నాకురింజిజా ఎన్నికై బురుండి దేశానికి దీర్ఘకాల అధ్యక్షుడిగా పని చేసి తన పాలనాకాలంలో రాజకీయ ప్రత్యర్థుల హత్యలు, అరెస్టులు చేసిన నాకురింజిజా అప్రతిష్ట కూడగొట్టున్నాడు. నేటి గ్లోబల్ మహమ్మారి సమయంలో కూడా స్టేడియాలలో భారీ ర్యాలీలు చేసి తమ పార్టీని గెలిపించమని విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. మాజీ తిరుగుబాటు నాయకుడు, మానవ హక్కుల ఉల్లంఘనలకు కారణమయ్యాడనే ఆరోపణలను ఎదుర్కొంటూ అంతర్జాతీయ ప్రయత్నాలను తప్పించుకొంటూ గత 15 సంవత్సరాలుగా శిక్షార్హత లేకుండా దేశాన్ని పాలించిన నాకురుంజిజాకు వారసుడిని, బురుండి దేశ పౌరులు బుధవారం నాడు ఎన్నుకుంటున్నారు. సుమారు 1,500 పోలింగ్ కేంద్రాలలో ఐదు మిలియన్లకు పైగా ప్రజలు ఓటు వేస్తున్నారని, 1993 లో ప్రారంభమై 2005 లో ముగిసిన అంతర్యుద్ధం తరువాత ఇది మొదటి పోటీ ఎన్నిక అని నిపుణులు చెపుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుండి, దేశ సరిహద్దులు తెరచి ఉంచుతూ పెద్ద పెద్ద ర్యాలీలు నిర్వహించడానికి అధికారులు అనుమతినిస్తూ కరోనా నుంచి దేవుడు కాపాడుతాడని ఉదహరిస్తున్న నేపథ్యంలో, కరోనా సంక్రమణకు దారితీస్తుందని who అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం దేశంలో సానుకూల కేసులు పెద్దగా లేవని కేవలం ఒక మరణం మాత్రమే నమోదయిందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు బురుండీలో లేవని, కరోనా వైరస్ వ్యాప్తి ఆసలే లేదని ఇది దేశాన్నిపెద్దగా ప్రభావితం చేయదని ప్రభుత్వ అధికారులు చెపుతున్నారు. గోజిలోని ఒక సమావేశంలో బురుండి అధ్యక్షుడు ఒక అడుగు ముందు వేసి మనం రద్దీగా ఉన్నాము కదా మనకు ఏమైనా సమస్య ఉందా, ‘ఎల్లప్పుడూ దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి చప్పట్లు కొడదాం’ అని ప్రజలను ఆదేశించాడు.