ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి)మనుబోలు మండలం ఫోర్టు రోడ్డు ఆపోజిట్లోని ఓ వెంచర్లో నిలిపి ఉన్న కారులో వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. తిరుపతి జిల్లా తడ మండలం భీమవారిపాలెం గ్రామానికి చెందిన దాన సుందరం రాజా (తండ్రి: దాన సుందరం) కారులో అపస్మారక స్థితిలో ఉన్నట్లు రైతులు గమనించి మనుబోలు పోలీస్ స్టేషన్కు సమాచారం ఇచ్చారు. పోలీసులు క్లూస్ టీం సహాయంతో కారు తెరిచి మృతదేహాన్ని వెలికి తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




