మంత్రాలయంలో దళిత క్రైస్తవుల రాజకీయ చైతన్య సభ విజయవంతం.. ఎస్సీ హోదా కల్పించాలని బీఎస్పీ డిమాండ్
మంత్రాలయంలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత క్రైస్తవుల రాజకీయ చైతన్య సభ విజయవంతమైంది. రాఘవేంద్ర సర్కిల్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ప్లేకార్డులతో భారీ ర్యాలీ నిర్వహించి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని నేతలు డిమాండ్ చేశారు. సభలో పాల్గొన్న బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి మంచ లక్ష్మీ నారాయణ రాజకీయ చైతన్యం ద్వారానే సామాజిక న్యాయం సాధ్యమని పేర్కొన్నారు. తెలంగాణ బీఎస్పీ నేత పి. బాలస్వామి సహా పలువురు నాయకులు హాజరై దళితులు, బీసీలు, మైనార్టీలు రాజ్యాధికారం కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

మంత్రాలయంలో దళిత క్రైస్తవుల రాజకీయ చైతన్య సభ విజయవంతం.. ఎస్సీ హోదా కల్పించాలని బీఎస్పీ డిమాండ్
మంత్రాలయంలో దళిత క్రైస్తవుల రాజకీయ చైతన్య సభ విజయవంతం.. ఎస్సీ హోదా కల్పించాలని బీఎస్పీ డిమాండ్ మంత్రాలయంలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత క్రైస్తవుల రాజకీయ చైతన్య సభ విజయవంతమైంది. రాఘవేంద్ర సర్కిల్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ప్లేకార్డులతో భారీ ర్యాలీ నిర్వహించి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని నేతలు డిమాండ్ చేశారు. సభలో పాల్గొన్న బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి మంచ లక్ష్మీ నారాయణ రాజకీయ చైతన్యం ద్వారానే సామాజిక న్యాయం సాధ్యమని పేర్కొన్నారు. తెలంగాణ బీఎస్పీ నేత పి. బాలస్వామి సహా పలువురు నాయకులు హాజరై దళితులు, బీసీలు, మైనార్టీలు రాజ్యాధికారం కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

