హైదరాబాద్ / ఖమ్మం
భూ భారతి చట్టంలోని అక్రమాలు, సమస్యలపై బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి చేపట్టిన దీక్షకు ఖమ్మం జిల్లా బీజేపీ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు దీక్షా కార్యక్రమానికి వెళ్లి తమ మద్దతును ప్రకటించారు. కార్యక్రమంలో బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు, జిల్లా సీనియర్ నాయకులు మందడపు సుబ్బారావు, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలుకూరు రమేష్, గిరిజన మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షలు భూక్యా శ్యాం సుందర్ నాయక్
కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నరుకుళ్ల వెంకటేశ్వరరావు, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు RVS యాదవ్ జిల్లా కార్యదర్శి పాల నాగసురేందర్రెడ్డి, పాల్గొన్నారు. భూ భారతి సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులు, భూ యజమానులకు న్యాయం చేయాలని నాయకులు కోరారు.



