జనగామ పట్టణంలోని ఎమ్మార్వో కు బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్దోజు జగదీష్ ఆధ్వర్యంలో మెమొరం ఇవ్వడం జరిగింది ముఖ్యఅతిథిగా రాష్ట్ర నాయకులు రమేష్ మాట్లాడుతూ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయి ఉన్న 14వేల కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేయాలని లేనియెడల దశలవారీగా ఉద్యమాలు చేపడతామని మొన్న అసెంబ్లీ ముట్టడి రేపు మంత్రు లను బయటికి తిరగకుండా విద్యార్థులు అడ్డుకోవడం జరుగుతుందని తెలిపారు విద్యార్థుల భవిష్యత్తును ఏలాంటి ఆటంకం కలగకుండా ఎప్పటికప్పుడు బకాయి పడిన ఫీజు రియంబర్స్మెంట్ ఎన్నికల్లో వాగ్దానం చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలని లేనిపక్షంలో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పడం ఖాయమని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు జిల్లా కన్వీనర్ పిట్టల సత్యం, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు జీవనజ్యోతి, ఎనగందుల కళ్యాణి , గంధం రాములు , దూసరి శివకృష్ణ, సీనియర్ నాయకులు కీర్తి నర్సయ్య, సాంబ శ్రీనివాస్, మొదలగు వారు పాల్గొనడం జరిగింది


