ప్రొద్దుటూరు: ఆ భూమిపై అధికారుల మౌనమేల?
ప్రొద్దుటూరులోని బొల్లవరం వెంకటేశ్వరస్వామి ఆలయం వెనుకవైపున 9.68 ఎకరాలు ల్యాండ్ సీలింగ్ భూములున్నాయి. 1975 లో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద ఈ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 1979లో 9 మందికి వ్యవసాయసాగుకు ఇచ్చింది. ప్రస్తుతం ఈ భూములను కొట్టేయడానికి స్కెచ్ వేశారంటూ వైసీపీ, టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. విలువైన ఈ భూములపై రచ్చ జరుగుతున్నా అధికారులు మౌనంగా ఉన్నారని ఆరోపణలున్నాయి.


