- పేద కుటుంబానికి నిత్యావసరాలు అందచేత
ఆత్మకూరు వింజం దొరసానమ్మ మెమోరియల్ ట్రస్టు ద్వారా ట్రస్టు అధినేత డాక్టర్ ప్రణీత్ బుధవారంనాడు ఓ పేద కుటుంబానికి నిత్యావసరాలు అందచేసి మరోమారు తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఆత్మకూరు పట్టణంలోని 16 వ వార్డు కు చెందిన సయ్యద్ ఇస్మాయిల్ బేల్దారి పనులు చేస్తుంటాడు. ఇటివల ఆరోగ్యం బాగాలేక పనులకు వెళ్లడం లేదు. అతని భార్య సయ్యద్ గౌస్ బి గుండె జబ్బుతో బాధపడుతుంది. హార్ట్ లో స్టంట్ వేసి ఉండడంతో ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న డాక్టర్ ప్రణీత్ తమ వింజం దొరసానమ్మ ఛారిటబుల్ ట్రస్టు ద్వారా ట్రస్ట్ సభ్యులు షావుద్దిన్ , టైలర్ రహీం ల ద్వారా వారికి నిత్యావసరాలను అందచేసి ఆదుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులు డాక్టర్ ప్రణీత్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.


