ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 17 (పున్నమి ప్రతినిధి)
సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు వేదాయపాళెంలోని తన కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వివిధ సమస్యలపై వినతిపత్రాలు స్వీకరించారు. ప్రజలు అందించిన ప్రతి అర్జీని పరిశీలించిన ఆయన, పరిష్కారం కావాల్సిన అంశాలపై సంబంధిత అధికారులకు వెంటనే సూచనలు చేశారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని సత్వర పరిష్కారం అందించడమే ప్రజాదర్బార్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రతి వినతిపత్రాన్ని పీజీఆర్ఎస్లో నమోదు చేసి నిర్ణీత గడువులో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెల్లడించారు. ప్రజలకు పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎమ్మెల్యే సోమిరెడ్డి
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 17 (పున్నమి ప్రతినిధి) సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు వేదాయపాళెంలోని తన కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వివిధ సమస్యలపై వినతిపత్రాలు స్వీకరించారు. ప్రజలు అందించిన ప్రతి అర్జీని పరిశీలించిన ఆయన, పరిష్కారం కావాల్సిన అంశాలపై సంబంధిత అధికారులకు వెంటనే సూచనలు చేశారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని సత్వర పరిష్కారం అందించడమే ప్రజాదర్బార్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రతి వినతిపత్రాన్ని పీజీఆర్ఎస్లో నమోదు చేసి నిర్ణీత గడువులో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెల్లడించారు. ప్రజలకు పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.

