పున్నమి ప్రతినిధి , రామచంద్రాపురం జూలై -26
మండలంలోని పిల్లారి కోన చెరువు ఆక్రమణలు జరిగిందంటూ వచ్చిన వార్తలపై స్పందించిన టిడిపి నాయకుడు రెడ్డప్ప నాయుడు, స్థానికులు చల్లా పద్మ, చల్లా మురళి లు, రెవెన్యూ , నీటి పారుదల శాఖ, అటవీ సంబంధిత అధికారులను కోరారు శనివారం వారు అధికారులతో కలిసి చెరువును , ఫారెస్ట్ హద్దులను పరిశీలించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ నిన్నటి రోజున కొన్ని పత్రికలలో చెరువును అలాగే ఫారెస్ట్ స్థలాలను ఆక్రమించుకున్నారని అలాంటిది ఏమీ లేదని ఒకవేళ ఉన్నట్లయినా, ఇతరులు ఆక్రమించుకున్న పూర్తి స్థాయిలో చేసి సర్వే చేసి ఆక్రమణులను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు గతంలో విశ్వనాథ మందిడి కి ప్రభుత్వం డికేటి పట్టా మంజూరు చేసిందని తనకిచ్చిన పట్టా మేరకు తన భూమిని చదును చేసుకున్నట్లు తెలిపారు చెరువు మొరవను విశ్వనాథ మందిడి ఆక్రమించుకున్నాడనేది రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి వాస్తవాలను తేల్చాలని అధికారులను కోరారు కొంతమంది మాపై ఆక్రమణల పేరుతో బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మమ్మల్ని రోడ్డుపై లాగుతున్నారని మండిపడ్డారు ఇది సమంజసం కాదని అన్నారు ఈ ఆక్రమణల ఆరోపణలపై తెలుగు దేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదని మీడియా కి తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నాగరాజు,తానికొండ మురళీమోహన్ నాయుడు, వాసు తదితరులు ఉన్నారు



