పరిశుభ్రతే ప్రగతికి తొలిమెట్టు: చమర్తి జగన్ మోహన్ రాజు గారు
కడప జిల్లా రాజంపేట పట్టణంలోని 3వ వార్డు గడ్డి వీధిలో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమంలో రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు స్వయంగా చీపురు పట్టి శ్రమదానంలో పాల్గొన్నారు. మున్సిపల్ సిబ్బంది, అధికారులు, టీడీపీ నాయకులతో కలిసి పరిసరాలను శుభ్రం చేశారు. పరిశుభ్రత ప్రతి ఒక్కరి జీవన విధానంగా మారాలని, చెత్తను నిర్దేశిత ప్రదేశాల్లోనే వేస్తూ రాజంపేటను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, బీసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


