ఖమ్మం, జూన్
(పువ్వాడ నాగేంద్ర కుమార్, పున్నమి జిల్లా ప్రతినిధి)
భారత ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఖమ్మం జిల్లా బీజేపీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మేధావుల సదస్సుకు నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే ఎండేలా లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ఈ సదస్సు నేడు సాయంత్రం 5 గంటలకు ఖమ్మంలోని పాత బస్టాండ్ సమీపంలోని కావేరి హోటల్లో నిర్వహించనున్నారు.



