నెల్లూరు జిల్లాలో లాడ్జిలు, వాహనాలపై ఆకస్మిక తనిఖీలు – పోలీసులు పటిష్ఠంగా చర్యలు
| నెల్లూరు | పున్నమి ప్రతినిధి
జిల్లా వ్యాప్తంగా నేర నియంత్రణ చర్యల్లో భాగంగా, నెల్లూరు జిల్లా యస్.పి. శ్రీ జి. కృష్ణకాంత్, IPS గారి ఆదేశాల మేరకు, అడిషనల్ యస్.పి (అడ్మిన్) శ్రీమతి CH. సౌజన్య గారి సూచనలతో పోలీసులు 19.04.2025 న రాత్రి 09:00 గంటల నుండి 11:00 గంటల వరకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీలలో భాగంగా,
- మొత్తం 96 లాడ్జిలను పోలీసులు పరిశీలించారు.
- ప్రతి గదిలో పోలీసులు తనిఖీలు నిర్వహించి, అక్కడ బస చేస్తున్న వ్యక్తుల వివరాలు సేకరించారు.
- అనుమానాస్పదంగా కనిపించిన వారిని ప్రశ్నించి, వారి ప్రయాణ ప్రయోజనాలపై ఆరా తీశారు.
లాడ్జిల యాజమాన్యానికి సూచనలు:
- అనుమానితుల గురించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్న సూచనలతో పాటు,
- లాడ్జిల పరిసరాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని అధికారులు స్పష్టం చేశారు.
వాహన తనిఖీలు – కఠిన చర్యలు:
- జిల్లాలోని అన్ని కూడళ్ళు, హైవేలు, ప్రవేశ–నిష్క్రమణ మార్గాల్లో వాహనాలు తరిఖీ చేయబడ్డాయి.
- మొత్తం 3100 వాహనాలు తనిఖీ చేయగా,
- డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 30 మందిపై కేసులు నమోదు కాగా,
- 70 MV యాక్ట్ ఉల్లంఘన కేసులు నమోదు చేశారు.
- మొత్తం రూ.43,080/- జరిమానాలు విధించారు.
పౌరులకు సూచనలు:
- హెల్మెట్ ధరించడం, లైసెన్స్ లేకుండా వాహనాలు నడపకపోవడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయకూడదు.
- మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, అతివేగం, డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్ఫోన్ ఉపయోగిస్తూ డ్రైవింగ్ వంటి ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
- జాతీయ రహదారులపై రాంగ్ రూట్లు వాడకూడదని, క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలన్న సందేశం ఇచ్చారు.
విజిబుల్ పోలీసింగ్ ముమ్మరం:
ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, పోలీసులు విజిబుల్ పోలీసింగ్ పటిష్ఠంగా అమలు చేయాలని యస్.పి. గారు సూచించారు.