తెలుగుదేశం పార్టీ కేంద్ర కమిటీ ఆదేశాల మేరకు మహానాడు నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ క్రమంలో నెల్లూరు కోవూరు జాతీయ రహదారి సమీపంలోని ఇఫ్కో భూములు, రేగడి చెలిక వద్ద ఉన్న సుమారు 110 ఎకరాల విస్తీర్ణాన్ని పార్టీ నాయకులు పరిశీలించారు. పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, కాకర్ల సురేష్, కృష్ణారెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు. మహానాడు విజయవంతం చేసేందుకు అన్ని వసతులు కల్పించాలని నాయకులు అధికారులకు సూచించారు. కార్యక్రమం నిర్వహణకు అనుకూలతలపై సమగ్రంగా పరిశీలించారు.



