నంద్యాల పట్టణంలోని 4వ వార్డు కోటవీధి, 3వ వార్డు జెండావీధిలో టీడీపీ ఆధ్వర్యంలో “ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి NMD ఫిరోజ్, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ గడుపాటి నారాయణస్వామి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఇంటింటికీ తిరిగి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని NMD ఫిరోజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



