నందిపేట్ తహశీల్దార్ సంతోష్ రెడ్డిపై నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సస్పెన్షన్ వేటు వేశారు. అసైన్డ్ భూముల వ్యవహారంలో అవకతవకలకు పాల్పడటం, విధుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహించినట్లు ఆరోపణలు రావడంతో కలెక్టర్ దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించారు. ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా విచారణ జరిపి నివేదిక సమర్పించగా, ఆ నివేదిక ఆధారంగా కలెక్టర్ ఈ కఠిన చర్యలు తీసుకున్నారు.



