నిక్షిత్ రామ్ అన్నప్రాసన కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు.
మైలవరం, కీర్తిరాయునిగూడెం, సెప్టెంబర్ 17:
మైలవరం మండలం కీర్తిరాయునిగూడెం గ్రామంలో ఏపీ లైవ్స్టాక్ కార్పొరేషన్ డైరెక్టర్ దొండపాటి విజయకుమార్ గారి కుమారుడు నిక్షిత్ రామ్ అన్నప్రాసన కార్యక్రమం గురువారం వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఆత్మీయుల సమక్షంలో అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ శుభకార్యక్రమానికి మైలవరం శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వసంత వెంకట కృష్ణప్రసాదు గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారి నిక్షిత్ రామ్ను ఆప్యాయంగా ఆశీర్వదించి, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
అనంతరం దొండపాటి విజయకుమార్ గారు, వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు అభినందించి, అన్నప్రాసన శుభకార్యక్రమం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని, మంచి ఆరోగ్యం, విద్య, సంతోషాలతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. మైలవరం మండలం



