భారత ఉప రాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్ మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ధ్వజస్తంభానికి నమస్కరించి శ్రీవారి దర్శనం చేశారు. వేద పండితులు ఆశీర్వచనం అందించగా, టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. బేడి ఆంజనేయస్వామివారిని కూడా దర్శించుకున్నారు.

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్
భారత ఉప రాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్ మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ధ్వజస్తంభానికి నమస్కరించి శ్రీవారి దర్శనం చేశారు. వేద పండితులు ఆశీర్వచనం అందించగా, టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. బేడి ఆంజనేయస్వామివారిని కూడా దర్శించుకున్నారు.

