Saturday, 12 July 2025
  • Home  
  • తాగునీటి సమస్యలకు రూ .1.40 కోట్లు మంజూరు ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా
- E-పేపర్ - Featured - ఆంధ్రప్రదేశ్ - చిత్తూరు

తాగునీటి సమస్యలకు రూ .1.40 కోట్లు మంజూరు ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా

నగరి నియోజకవర్గంలో తాగునీటి సమస్య ఉన్న 96 గ్రామాలను గుర్తించి పరిష్కారం కోసం రూ .1.40 కోట్లు మంజూరు చేయించినట్లు నగరి ఎమ్మెల్యే , ఏపీఐఐసీ చైర్ పర్సన్ ఆర్.కే. రోజా తెలిపారు . మంగళవారం ఆమె నగరి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు . ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి తాగునీటి సమస్య పరిష్కరించే దిశగా నిధులు విడుదల చేసి తాగునీటి సమస్య పరిష్కారం కోసం 96 గ్రామాల్లో బోర్లు వేయించేందుకు చర్యలు చేపట్టాలని కోరినట్లు పేర్కొన్నారు . ఇందుకుగాను 80 పనులను గుర్తించి ఆ దిశగా జిల్లా కలెక్టర్ కు ఆర్ డబ్ల్యు ఎస్ నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారన్నారు . దీంతో ఆయా గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారం కోసం అధికారులు చర్యలు చేపట్టడంతో పాటు తాగునీటి పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని రోజా వివరించారు . ఆ దిశగా అధికారులతో సమన్వయం చేసుకుంటూ త్వరగా పనులను వేగవంతం చేయాలని మండలాల అధికారులకు సూచించారు . గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారమైతే గ్రామీణ ప్రాంత ప్రజలు ఎమ్మెల్యే రోజా కు రుణపడి ఉంటారని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు .

నగరి నియోజకవర్గంలో తాగునీటి సమస్య ఉన్న 96 గ్రామాలను గుర్తించి పరిష్కారం కోసం రూ .1.40 కోట్లు మంజూరు చేయించినట్లు నగరి ఎమ్మెల్యే , ఏపీఐఐసీ చైర్ పర్సన్ ఆర్.కే. రోజా తెలిపారు . మంగళవారం ఆమె నగరి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు . ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి తాగునీటి సమస్య పరిష్కరించే దిశగా నిధులు విడుదల చేసి తాగునీటి సమస్య పరిష్కారం కోసం 96 గ్రామాల్లో బోర్లు వేయించేందుకు చర్యలు చేపట్టాలని కోరినట్లు పేర్కొన్నారు . ఇందుకుగాను 80 పనులను గుర్తించి ఆ దిశగా జిల్లా కలెక్టర్ కు ఆర్ డబ్ల్యు ఎస్ నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారన్నారు . దీంతో ఆయా గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారం కోసం అధికారులు చర్యలు చేపట్టడంతో పాటు తాగునీటి పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని రోజా వివరించారు . ఆ దిశగా అధికారులతో సమన్వయం చేసుకుంటూ త్వరగా పనులను వేగవంతం చేయాలని మండలాల అధికారులకు సూచించారు . గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారమైతే గ్రామీణ ప్రాంత ప్రజలు ఎమ్మెల్యే రోజా కు రుణపడి ఉంటారని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు .

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.