పలమనేరు,జూన్25,2020(పున్నమి విలేకరి): ఆశావర్కర్ల ఆల్ ఇండియా డిమాండ్స్ డే ని పురస్కరించుకుని తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు.ఈ సందర్బంగా ఆశా వర్కర్ల జిల్లా ప్రధాన కార్యదర్శి భువనేశ్వరి మాట్లాడుతూ… ఆశాలను రెగ్యులరైజ్ చేసి,చట్ట బద్ధమైన సౌకర్యాలు కల్పించాలన్నారు. కోవిడ్ డ్యూటీ లో ఉన్న ఆశా లకు నెలకు ప్రత్యేక అలవెన్సు రూ.10000 ఇవ్వాలని, భద్రతా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రమాద బీమా 50 లక్షలు వర్తింపజేయాలని,3సంవత్సరాల నుండి పెండింగులో ఉన్న యూనిఫామ్స్ వెంటనే అందచేయాలన్నారు.రక్షణ చర్యలు చేపట్టకుండా రోగులను ఆసుపత్రికి చెకప్ ల కోసం తీసుకురావాలని ఒత్తిడి చేవడం మానుకోవాలన్నారు. ప్రభుత్వ పథకాలన్నీ ఆశాలకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఆశా డివిజన్ కార్యదర్శి సావిత్రి,సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గిరిధర్ గుప్తా, ఆశాలు సలోమీ,పద్మ,కైరున్నిసా,గీత లతో పాటు మండలం లోని ఆశావర్కర్లు పాల్గొన్నారు.
తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ధర్నా
పలమనేరు,జూన్25,2020(పున్నమి విలేకరి): ఆశావర్కర్ల ఆల్ ఇండియా డిమాండ్స్ డే ని పురస్కరించుకుని తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు.ఈ సందర్బంగా ఆశా వర్కర్ల జిల్లా ప్రధాన కార్యదర్శి భువనేశ్వరి మాట్లాడుతూ… ఆశాలను రెగ్యులరైజ్ చేసి,చట్ట బద్ధమైన సౌకర్యాలు కల్పించాలన్నారు. కోవిడ్ డ్యూటీ లో ఉన్న ఆశా లకు నెలకు ప్రత్యేక అలవెన్సు రూ.10000 ఇవ్వాలని, భద్రతా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రమాద బీమా 50 లక్షలు వర్తింపజేయాలని,3సంవత్సరాల నుండి పెండింగులో ఉన్న యూనిఫామ్స్ వెంటనే అందచేయాలన్నారు.రక్షణ చర్యలు చేపట్టకుండా రోగులను ఆసుపత్రికి చెకప్ ల కోసం తీసుకురావాలని ఒత్తిడి చేవడం మానుకోవాలన్నారు. ప్రభుత్వ పథకాలన్నీ ఆశాలకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఆశా డివిజన్ కార్యదర్శి సావిత్రి,సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గిరిధర్ గుప్తా, ఆశాలు సలోమీ,పద్మ,కైరున్నిసా,గీత లతో పాటు మండలం లోని ఆశావర్కర్లు పాల్గొన్నారు.

