రాజన్న సిరిసిల్ల జిల్లా జూలై 17. పున్నమి ప్రతినిధి
ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో తొలి ఏకాదశి సందర్భంగా, శ్రీ గంటెల వెంకటరమణ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన శిష్యులు శ్రీ చిట్నేని మాధవి–వెంకటేశ్వరరావు విద్యాసాగర్ రావు ఆధ్వర్యంలో 25 మంది నిరుపేదలు, వృద్ధులు, వికలాంగులకు 13 రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొమ్మటి రాజమల్లు సూచన మేరకు అవసరమైన లబ్ధిదారులను గుర్తించి ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇప్పటికే చిప్పలపల్లి గ్రామంలోని పేద కుటుంబాలకు చీరలు, దుప్పట్లు, బియ్యం, పుస్తెమట్టెలు, ఆర్థిక సహాయం వంటి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన చిట్నేని మాధవి–వెంకటేశ్వరరావు విద్యాసాగర్ రావు దంపతుల సేవాభావాన్ని గ్రామస్థులు ప్రశంసించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే గురువుగారు శ్రీ గంటెల వెంకటరమణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.



