ఖమ్మం, జులై
(పున్నమి ప్రతినిది )
భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు సూచనల మేరకు, జిల్లా SIR కన్వీనర్ శ్యామ్ రాథోడ్, ఖమ్మం అసెంబ్లీ బీఎల్ఏ–1 వీరవెల్లి రాజేష్ సమక్షంలో జాతీయ ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమానికి టూ టౌన్ పరిధిలో ఇన్చార్జీలను నియమించారు.
ఈ సందర్భంగా జిల్లా సీనియర్ నాయకుడు మందడపు సుబ్బారావును 10, 11, 55, 56, 57 డివిజన్లకు, డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లును 43, 50, 52, 53, 54 డివిజన్లకు, మేకల నాగేందర్ను 44, 45, 49, 51, 58 డివిజన్లకు సమగ్ర ఓటరు సవరణ కార్యక్రమ ఇన్చార్జీలుగా నియమించారు.
వీరికి సహాయకులుగా ఖమ్మం బీజేపీ టూ టౌన్ ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు సమన్వయంతో పనిచేయాలని టూ టౌన్ అధ్యక్షుడు వెంకటనారాయణ కోరారు.
బూత్ ఫోకస్ కమిటీ టూ టౌన్ పరిధిలోని బూత్ల పరిశీలన ప్రారంభిస్తున్న నేపథ్యంలో, బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇన్చార్జీలు, బీఎల్ఏ–2లు, మండల నాయకులు, జిల్లా నాయకులు ఫోకస్ కమిటీకి పూర్తి సహకారం అందించి సమగ్ర ఓటరు సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.



