శ్రీకాళహస్తి, ఏప్రిల్ 22 (పున్నమి న్యూస్( శ్రీకాళహస్తి తెలుగు గంగ కాలనీలోని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల బాలికల అప్గ్రేడెడ్ పాఠశాల/జూనియర్ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి 5వ నుండి 9వ తరగతుల వరకు ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ లలిత తెలిపారు. గిరిజన గురుకుల సంస్థ అమరావతి కార్యదర్శి ఆదేశాల మేరకు ఈ ప్రవేశ ప్రక్రియ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. తరగతి వారీగా 5వ తరగతిలో 51, 6వ తరగతిలో 26, 7వ తరగతిలో 11, 8వ తరగతిలో 1, 9వ తరగతిలో 6 సీట్లు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. ఈ ప్రవేశాలకు తిరుపతి జిల్లాకు చెందిన గిరిజన బాలికలకే అర్హత ఉందని స్పష్టం చేశారు. ఆసక్తి గల విద్యార్థినులు నేరుగా పాఠశాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. దరఖాస్తు చేసిన వారికి జూన్ 15, 2026న ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని గిరిజన బాలికలు సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు.

గిరిజన బాలికలకు గురుకులంలో ప్రవేశాలు
శ్రీకాళహస్తి, ఏప్రిల్ 22 (పున్నమి న్యూస్( శ్రీకాళహస్తి తెలుగు గంగ కాలనీలోని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల బాలికల అప్గ్రేడెడ్ పాఠశాల/జూనియర్ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి 5వ నుండి 9వ తరగతుల వరకు ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ లలిత తెలిపారు. గిరిజన గురుకుల సంస్థ అమరావతి కార్యదర్శి ఆదేశాల మేరకు ఈ ప్రవేశ ప్రక్రియ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. తరగతి వారీగా 5వ తరగతిలో 51, 6వ తరగతిలో 26, 7వ తరగతిలో 11, 8వ తరగతిలో 1, 9వ తరగతిలో 6 సీట్లు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. ఈ ప్రవేశాలకు తిరుపతి జిల్లాకు చెందిన గిరిజన బాలికలకే అర్హత ఉందని స్పష్టం చేశారు. ఆసక్తి గల విద్యార్థినులు నేరుగా పాఠశాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. దరఖాస్తు చేసిన వారికి జూన్ 15, 2026న ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని గిరిజన బాలికలు సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు.

