పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 11 చిట్టమూరు మండలం,
మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో నివసించే గిరిజన ప్రాంతాల్లో నివసించే పేద విద్యార్థుల్లో విద్యావ్యక్తి కోసం ఎంవి రావు ఫౌండేషన్ కృషి చేస్తాం అని
ఎంపీపీ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు ఎం శ్రీనివాసులు అన్నారు.
చిట్టమూరు మండలం ఈశ్వర్వాక పంచాయతీ పరిధిలోని కారుపాటి దెబ్బ గిరిజన కాలనీలో ఉన్న ఎంపీపీ పాఠశాల, విద్యార్థిని విద్యార్థులకు అవసరమైన నోట్ బుక్స్, పలకలను స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు శ్రీమతి ఆదిలక్ష్మి గార్ల జ్ఞాపకార్థం ఎం వి రావు ఫౌండేషన్ 19వ వార్షికోత్సవ పురస్కరించుకొని ఆ ఫౌండేషన్ చైర్మన్ ఉప్పువరపు లీలా మోహన్ కృష్ణ కార్యదర్శి ఎం విజయలక్ష్మి చేతులు మీదుగా పాఠశాల అంగనవాడి విద్యార్థినీ విద్యార్థులకు పంపిణీ చేశారు.
కారిపాటి దెబ్బ గ్రామంలో అందరూ గిరిజనులు నిరుపేదలు వారికి అవసరమైన నోట్స్ పలకలో లేవని ప్రధానోపాధ్యాయులు ఎంవి రావు ఫౌండేషన్ తెలియజేయడంతో వారికి అవసరమైన విద్యా సామాగ్రి అంతా ఎం వి రావు ఫౌండేషన్ సౌజన్యంతో అందించడం జరిగింది.
అదేవిధంగా ఆ గిరిజన కాలనీలో నివసిస్తున్న నిరుపేదలైన గిరిజన కోసం ఆగస్టు 14వ తేదీ శుక్రవారం గ్రామంలో నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని వారిలో దృష్టిలోపాన్ని నివారించేందుకు ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నామని లీలా మోహన్ కృష్ణ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎం వి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ,కార్యదర్శి ఎం విజయలక్ష్మి,ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు,ఉపాధ్యాయులు సయ్యద్ సుబ్రిన్ గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.



