Tuesday, 15 July 2025
  • Home  
  • కుటుంబ సభ్యులు మరణిస్తే – కంపెనీ లీవ్ పాలసీ లు !
- Featured - ఆంధ్రప్రదేశ్ - బిజినెస్

కుటుంబ సభ్యులు మరణిస్తే – కంపెనీ లీవ్ పాలసీ లు !

కుటుంబ సభ్యులు మరణిస్తే – కంపెనీ లీవ్ పాలసీ లు ! ఈ ఆర్టికల్ క్రింది ఉద్యోగులకు కాక ముఖ్యం గా మేనేజిమెంటు వారి కోసం , పదిమంది తమకు రిపోర్టు చేసే స్థాయి లో ఉన్న మేనేజర్ ల కోసం రాయబడింది. ముఖ్యం గా, శెలవు మంజూరు చేసే , లేదా తిప్పి కొట్టే అధికారం ఉన్న వారి కోసం .  ‘ శెలవు ‘అనేది తమ హక్కు గా ఉద్యోగులు భావిస్తారు . శెలవు అనేది బాధ్యత గా వాడాలనీ , అవసరం ఉంటేనే వాడాలనీ, ఉన్నాయి కదా ? సంవత్సరాంతం లో మిగిలి పోయాయి కదా ? ‘ మురిగి పోతాయేమో ‘ ( వాడని లీవులు ) అని అవసరం ఉన్నా లేకున్నా డిసెంబరులో సగం రోజులు శెలవు పెట్టే ప్రాక్టీసు ను  పై అధికారులు  హర్షించరు !! సరే వీటి న్యాయాన్యాయాలు తరువాత చూద్దాం ! ఇప్పుడు కరోనా ప్యాండమిక్ వచ్చి వ్యాపారలనూ, పని తీరునూ, పని చేసే విధానాన్నీ ( వీలైన చోట్ల వర్క్ ఫ్రం హోం ) సమూలం గా మార్చి వేసింది . ఉద్యోగినీ ఉద్యోగులు , పై స్థాయి మేనేజర్ ల మధ్య సంబంధాలను కూడా మార్చి వేసింది . కొన్ని చోట్ల అవి మెరుగు పడ్డాయి, కొన్ని చోట్ల దెబ్బ తిన్నాయి . సెలవు దొరకడం అత్యంత కష్టమైన , అత్యవసర సర్విసుల లో ( ప్రభుత్వ మరియు ప్రైవేటు ) పని చేసే కొందరు మిత్రులతో మాట్లాడుతూ నే ఉన్నాను . ” మీ దగ్గర శెలవు దొరకడం కష్టం కదా ? ప్రస్తుతం ఎలా ఉంది పరిస్థితి ? ” అని . ఒక గుడ్ న్యూసు ఏమిటంటే , చాలా చోట్ల , మన వాడు ఫోన్ చేసి , ‘ నాకు జలుబు దగ్గు ఉంది సార్ / మేడం ! మాస్కు కట్టుకుని రానా మరి ? ‘ అని దాదాపు బెదిరించే టెర్రరిష్టు ధోరణి లో అడగడం , పై వారేమో ‘ ఆహా వద్దు వద్దు ! కావాలంటే నువ్వు వారం శెలవు తీసుకో ! ” అని , ‘ ఆరోగ్యం జాగ్రత్త ‘ అని ముక్తాయిస్తున్నారట ! మన వాళ్ళు కొంత రిలీఫ్ తో చెప్పారు .  మీరు ఒక కంపెనీ ని నడుపుతూ ఉంటే, లేదా మీరు పర్యవేక్షక / లేదా పై స్థాయి లో పని చేసే సీనియర్ అధికారి ( ణి ) అయితే, మా వైపు నుంచి కొన్ని విజ్ఞప్తులు ! (1)   కుటుంబ సభ్యులని కోల్పోయిన ఉద్యోగులు దుఃఖం తో ఉంటారు . దశదిన కర్మ కంటే ఎక్కువ రోజులు, వారు మానసికం గా కోలుకునే వరకూ జీతం కూడిన లీవు ఇవ్వండి . (2)   వారు శెలవు లో ఉన్నప్పుడు, రెండు మూడు సార్లు ఫోన్ చెయ్యండి . ఏమైనా సహాయం కావాలా అడగండి . ఇల్లు దగ్గర ఉంటే ఒకసారి పర్సనల్ గా వెళ్ళి పరామర్శించండి . డబ్బు సాయం, ఆఫీసు నుంచి అడ్వాన్సు ఇప్పించడం , ఏవైనా ఆఫీసుల నుంచి నింపవలసిన  దస్తావేజులు ఉంటే వాటిని తెప్పించి ఇవ్వడం, ఇలా ఏదైనా ? (3)   ఎవరెవరు చనిపోతే జీతం తో కూడిన లీవు ఇవ్వాలి ? ఈ కరోనా సమయం లో ఇది సంక్లిష్టమైన ప్రశ్న . కేవలం కుటుంబానికే పరిమితం చేయకండి! (4)   మనమందరం ఎన్నో సంఘటనలు చూశాం , చదివాం . మన లొకాలిటీ లో ఎవరో వృద్ధులు కరోనా బారిన పడి చనిపోతారు . వారి పిల్లలు పెళ్ళయి , ఇక్కడ లేక పోవచ్చు . ఈ దేశం లో నే లేక పోవచ్చు. వారు వచ్చే దాకా , చుట్టు పక్కల వారు, ఫ్యామిలీ ఫ్రండ్స్ , ఎన్నో పనులు చేయాల్సి రావచ్చు . శవాన్ని ఐస్ బాక్సు లో ఉంచడం లాంటివి . అందరూ ఉండి, ఆపత్కాలం లో ఎవరూ లేని అనాధలు  గా చనిపోయే దయనీయ స్థితులను గత సంవత్సర కాలం గా ఎన్నో చూశాం . కాబట్టి, కేవలం భార్య / భర్త / పిల్లలు / తల్లిదండ్రులే కాక , అత్త, పిన్ని, బాబాయి, మామయ్య ,చుట్టాలు, పక్కాలు, ఇలా ఎవరు హఠాత్తు గా గతించినా, మీ ఉద్యోగులలో ఒకరు ఆ కారణం గా లీవు అడిగినా, ఈ విపత్కర సమయం లో కాదనకండి , కాస్త పెద్ద మనసు చేసుకుని , మంజూరు చేయండి . ఏమి జరుగుతోందో , కనిపెట్టి ఉండి , కనుక్కోండి. (5)   మీకు వాస్తవం తెలిస్తే, మీ ఉద్యోగి ( ని ) మరణానికి సంబంధించిన డెత్ సర్టిఫికేటు , శ్మశానం నుంచి పత్రం , లేక డాక్టర్ సర్టిఫికేటు, అలాంటివి  అడగకండి . మరీ తప్పని సరి అయితే తప్ప , ఇలాంటి దస్తావేజులు లేకుండానే లీవు అప్రూవ్ అయేలా చూడండి . (6)   మీ సంస్థ , ఎవరైనా సైకాలజిస్టు తో వ్యాపార ఒప్పందం అయి ఉందా ? విపరీమైన మానసిక వత్తిడి ఉండి, పని లో లీనం కాలేక పోతున్న ఉద్యోగులకు కాస్త కౌన్సెలింగ్ ఇప్పించండి . కంపెనీ ఖర్చు తో . ఆ సమయం లో అది వారికి అవసరం కావచ్చు .  వీటిలో ఏవి  వీలైతే అవి మీ సంస్థ లో అమలు చేయండి. ఈ దేశం , ఆ దేశం అని కాకుండా, ప్రపంచం మొత్తం ఇలాంటి జీవన్మరణ సమస్య లో ఉన్నప్పుడు , మనం ఒకరి పట్ల ఒకరు కారుణ్యం తో, కాస్త పెద్ద మనసుతో మెలగడమే పరిష్కారం . ఆపత్కాలం లో మీరు చేసిన మేలు, మీ ఉద్యోగులు ఎన్నటికీ మరిచిపోరు . చాలా కాలం గుర్తు ఉంచుకుంటారు . పదిమందికి చెబుతారు. CV Ramana, Hyderabad.

కుటుంబ సభ్యులు మరణిస్తే – కంపెనీ లీవ్ పాలసీ లు !

ఈ ఆర్టికల్ క్రింది ఉద్యోగులకు కాక ముఖ్యం గా మేనేజిమెంటు వారి కోసం , పదిమంది తమకు రిపోర్టు చేసే స్థాయి లో ఉన్న మేనేజర్ ల కోసం రాయబడింది.

ముఖ్యం గా, శెలవు మంజూరు చేసే , లేదా తిప్పి కొట్టే అధికారం ఉన్న వారి కోసం .

 ‘ శెలవు ‘అనేది తమ హక్కు గా ఉద్యోగులు భావిస్తారు . శెలవు అనేది బాధ్యత గా వాడాలనీ , అవసరం ఉంటేనే వాడాలనీ, ఉన్నాయి కదా ? సంవత్సరాంతం లో మిగిలి పోయాయి కదా ? ‘ మురిగి పోతాయేమో ‘ ( వాడని లీవులు ) అని అవసరం ఉన్నా లేకున్నా డిసెంబరులో సగం రోజులు శెలవు పెట్టే ప్రాక్టీసు ను  పై అధికారులు  హర్షించరు !!

సరే వీటి న్యాయాన్యాయాలు తరువాత చూద్దాం ! ఇప్పుడు కరోనా ప్యాండమిక్ వచ్చి వ్యాపారలనూ, పని తీరునూ, పని చేసే విధానాన్నీ ( వీలైన చోట్ల వర్క్ ఫ్రం హోం ) సమూలం గా మార్చి వేసింది .

ఉద్యోగినీ ఉద్యోగులు , పై స్థాయి మేనేజర్ ల మధ్య సంబంధాలను కూడా మార్చి వేసింది . కొన్ని చోట్ల అవి మెరుగు పడ్డాయి, కొన్ని చోట్ల దెబ్బ తిన్నాయి .

సెలవు దొరకడం అత్యంత కష్టమైన , అత్యవసర సర్విసుల లో ( ప్రభుత్వ మరియు ప్రైవేటు ) పని చేసే కొందరు మిత్రులతో మాట్లాడుతూ నే ఉన్నాను . ” మీ దగ్గర శెలవు దొరకడం కష్టం కదా ? ప్రస్తుతం ఎలా ఉంది పరిస్థితి ? ” అని .

ఒక గుడ్ న్యూసు ఏమిటంటే , చాలా చోట్ల , మన వాడు ఫోన్ చేసి , ‘ నాకు జలుబు దగ్గు ఉంది సార్ / మేడం ! మాస్కు కట్టుకుని రానా మరి ? ‘ అని దాదాపు బెదిరించే టెర్రరిష్టు ధోరణి లో అడగడం , పై వారేమో ‘ ఆహా వద్దు వద్దు ! కావాలంటే నువ్వు వారం శెలవు తీసుకో ! ” అని , ‘ ఆరోగ్యం జాగ్రత్త ‘ అని ముక్తాయిస్తున్నారట ! మన వాళ్ళు కొంత రిలీఫ్ తో చెప్పారు .

 మీరు ఒక కంపెనీ ని నడుపుతూ ఉంటే, లేదా మీరు పర్యవేక్షక / లేదా పై స్థాయి లో పని చేసే సీనియర్ అధికారి ( ణి ) అయితే, మా వైపు నుంచి కొన్ని విజ్ఞప్తులు !

(1)   కుటుంబ సభ్యులని కోల్పోయిన ఉద్యోగులు దుఃఖం తో ఉంటారు . దశదిన కర్మ కంటే ఎక్కువ రోజులు, వారు మానసికం గా కోలుకునే వరకూ జీతం కూడిన లీవు ఇవ్వండి .

(2)   వారు శెలవు లో ఉన్నప్పుడు, రెండు మూడు సార్లు ఫోన్ చెయ్యండి . ఏమైనా సహాయం కావాలా అడగండి . ఇల్లు దగ్గర ఉంటే ఒకసారి పర్సనల్ గా వెళ్ళి పరామర్శించండి . డబ్బు సాయం, ఆఫీసు నుంచి అడ్వాన్సు ఇప్పించడం , ఏవైనా ఆఫీసుల నుంచి నింపవలసిన  దస్తావేజులు ఉంటే వాటిని తెప్పించి ఇవ్వడం, ఇలా ఏదైనా ?

(3)   ఎవరెవరు చనిపోతే జీతం తో కూడిన లీవు ఇవ్వాలి ? ఈ కరోనా సమయం లో ఇది సంక్లిష్టమైన ప్రశ్న . కేవలం కుటుంబానికే పరిమితం చేయకండి!

(4)   మనమందరం ఎన్నో సంఘటనలు చూశాం , చదివాం . మన లొకాలిటీ లో ఎవరో వృద్ధులు కరోనా బారిన పడి చనిపోతారు . వారి పిల్లలు పెళ్ళయి , ఇక్కడ లేక పోవచ్చు . ఈ దేశం లో నే లేక పోవచ్చు. వారు వచ్చే దాకా , చుట్టు పక్కల వారు, ఫ్యామిలీ ఫ్రండ్స్ , ఎన్నో పనులు చేయాల్సి రావచ్చు . శవాన్ని ఐస్ బాక్సు లో ఉంచడం లాంటివి . అందరూ ఉండి, ఆపత్కాలం లో ఎవరూ లేని అనాధలు  గా చనిపోయే దయనీయ స్థితులను గత సంవత్సర కాలం గా ఎన్నో చూశాం .

కాబట్టి, కేవలం భార్య / భర్త / పిల్లలు / తల్లిదండ్రులే కాక , అత్త, పిన్ని, బాబాయి, మామయ్య ,చుట్టాలు, పక్కాలు, ఇలా ఎవరు హఠాత్తు గా గతించినా, మీ ఉద్యోగులలో ఒకరు ఆ కారణం గా లీవు అడిగినా, ఈ విపత్కర సమయం లో కాదనకండి , కాస్త పెద్ద మనసు చేసుకుని , మంజూరు చేయండి . ఏమి జరుగుతోందో , కనిపెట్టి ఉండి , కనుక్కోండి.

(5)   మీకు వాస్తవం తెలిస్తే, మీ ఉద్యోగి ( ని ) మరణానికి సంబంధించిన డెత్ సర్టిఫికేటు , శ్మశానం నుంచి పత్రం , లేక డాక్టర్ సర్టిఫికేటు, అలాంటివి  అడగకండి . మరీ తప్పని సరి అయితే తప్ప , ఇలాంటి దస్తావేజులు లేకుండానే లీవు అప్రూవ్ అయేలా చూడండి .

(6)   మీ సంస్థ , ఎవరైనా సైకాలజిస్టు తో వ్యాపార ఒప్పందం అయి ఉందా ? విపరీమైన మానసిక వత్తిడి ఉండి, పని లో లీనం కాలేక పోతున్న ఉద్యోగులకు కాస్త కౌన్సెలింగ్ ఇప్పించండి . కంపెనీ ఖర్చు తో . ఆ సమయం లో అది వారికి అవసరం కావచ్చు .

 వీటిలో ఏవి  వీలైతే అవి మీ సంస్థ లో అమలు చేయండి. ఈ దేశం , ఆ దేశం అని కాకుండా, ప్రపంచం మొత్తం ఇలాంటి జీవన్మరణ సమస్య లో ఉన్నప్పుడు , మనం ఒకరి పట్ల ఒకరు కారుణ్యం తో, కాస్త పెద్ద మనసుతో మెలగడమే పరిష్కారం . ఆపత్కాలం లో మీరు చేసిన మేలు, మీ ఉద్యోగులు ఎన్నటికీ మరిచిపోరు . చాలా కాలం గుర్తు ఉంచుకుంటారు . పదిమందికి చెబుతారు.
CV Ramana, Hyderabad.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.