కావలి, జూలై 25: పున్నమి ప్రతినిధి
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కావలి పట్టణం ముసునూరు ఇందిరమ్మ కాలనీలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. కర్పూరి మిధున్ కుమార్ (20) అనే యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
కుటుంబ సభ్యులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం కావలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మిధున్ కుమార్ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నెలకొల్పింది.


